నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష - ఘనంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు - ఆధ్యాత్మిక విలువల తోనే ప్రశాంతమైన జీవితం - భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు మదనపల్లి నవంబర్ 28, ( బి. శ్రీనివాసులు రెడ్డి తరణం విలేఖరి ) : మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి రోడ్డు నందు గల శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అంద జేయగా, ఆలయ కమిటీ సభ్యులు దుశ్యా లువ, పూలమాలతో సన్మానించారు. ఆలయ స్థిర జీర్ణోధారణ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సహకారం మరువలేనిదని ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ దైవభక్తి, ఆధ్యాత్మిక విలువల తోనే మనిషి ప్రశాంతమైన జీవితం గడప గలడన్నారు. ఆలయాన్ని నూతనంగా సర్వాంగ సుందరంగా నిర్మించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రాచ్యత్య పొకడలతో సమాజం పెడత్రోవ పట్టకుండా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించి సన్మార్గంలో నడిపించడానికి ఆలయాలు దోహద పడతాయన్నారు. అలాగే తమ వంతు ఆలయ అభివృద్ధికి భవిష్యత్తు లోనూ సహాయ సహకారాలు అంది స్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Namitha News