Thursday, 16 April 2026 08:02:09 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష

Date : 28 November 2025 08:00 PM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష - ఘనంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు - ఆధ్యాత్మిక విలువల తోనే ప్రశాంతమైన జీవితం - భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు మదనపల్లి నవంబర్ 28, ( బి. శ్రీనివాసులు రెడ్డి తరణం విలేఖరి ) : మదనపల్లి పట్టణం నిమ్మనపల్లి రోడ్డు నందు గల శ్రీ పార్వతి పరమేశ్వర శివాలయాన్ని ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అంద జేయగా, ఆలయ కమిటీ సభ్యులు దుశ్యా లువ, పూలమాలతో సన్మానించారు. ఆలయ స్థిర జీర్ణోధారణ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే సహకారం మరువలేనిదని ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ దైవభక్తి, ఆధ్యాత్మిక విలువల తోనే మనిషి ప్రశాంతమైన జీవితం గడప గలడన్నారు. ఆలయాన్ని నూతనంగా సర్వాంగ సుందరంగా నిర్మించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రాచ్యత్య పొకడలతో సమాజం పెడత్రోవ పట్టకుండా ఆధ్యాత్మిక విలువలను పెంపొందించి సన్మార్గంలో నడిపించడానికి ఆలయాలు దోహద పడతాయన్నారు. అలాగే తమ వంతు ఆలయ అభివృద్ధికి భవిష్యత్తు లోనూ సహాయ సహకారాలు అంది స్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :