నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆనంద వృద్ధాశ్రమంలో స్వెటర్ల వితరణ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ మాతృమూర్తి కీర్తిశేషురాలు ఎంపీ భాగ్యలక్ష్మమ్మ జ్ఞాపకార్థం ఆమెను స్మరించుకుంటూ చైతన్య స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు స్వెటర్లను అందజేశారు. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సమస్త జనరల్ సెక్రెటరీ ఏ కవిత రాణి మాట్లాడుతూ సమస్త వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందం కి వారి తల్లిగారి అంటే మిక్కిలి ఎక్కువ ఇష్టం మరియు గౌరవం.. ఆమె అనారోగ్యంతో తనువు చాలించే సమయంలో కుమారుడిని వృద్ధాప్యంలో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటారు వృద్ధాశ్రమాన్ని స్థాపించాలని కుమారుడిని కోరగా ఆమె జ్ఞాపకార్థంగా ఏర్పడినది ఈ ఆనంద వృద్ధాశ్రమం.. నిరాశ్రయులైన వృద్ధులలో తమ తల్లిదండ్రులను చూసుకుంటూ సేవలందిస్తున్నారు మన అధ్యక్షులు ఎంపీ ఆనంద అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆనందం తన తల్లి చిత్రపటానికి నివాళులు అర్పించి ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులకు స్వెటర్లు అందజేశారు
Reporter
Namitha News