నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరురూరల్ తొలి రోజు మహానాడు విజయవంతం పుంగనూరు నియోజకవర్గంలో , తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు పుంగనూరు జి ఆర్ ఎస్ ఫంక్షన్ హల్ నందు రూరల్ టిడిపి సీనియర్ నాయకులు మాధవరెడ్డి,మార్కెట్ యార్డ్ చైర్మన్ శమీపతి, రాష్ట్ర గిరిజన ట్రై కార్ డైరెక్టర్ భూక్యా కృష్ణ నాయక్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చంద్రవతమ్మ,గంగాధర,రెడ్డెప్ప నాయుడు,కో డైరెక్టర్ కోలాట రమణ, రఘువ,తెలుగు మహిళ కవితమ్మ, జయశ్రీ,భాస్కర్ రెడ్డి, మరియు గ్రామ పంచాయతీ అధ్యక్షులు రామ కృష్ణ,సుబ్రహ్మణ్యం ల ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పంచాయతీ మరియు మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా పార్టీ నాయకుల లైవ్ ప్రోగ్రాం ను వీక్షించడం జరిగింది.రాష్ట్ర ప్రజల కు ప్రభుత్వ పథకాలు అందించడం లో ప్రతి నాయకుడు,కార్యకర్తలు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కార్యకర్తలే పార్టీ కి వెన్నెముక అని నాయకులు మాట్లాడారు. కార్యక్రమం లో పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Reporter
Namitha News