నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యువగళం పాదయాత్రతో టిడిపి ను అధికారంలోకి తీసుకువచ్చి తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించారని టీడీపీ సినియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు అన్నారు. శుక్రవారం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం టిడిపి రాష్ట్ర సీనియర్ నాయకులు కట్ట దొరస్వామి ఆధ్వర్యంలో మొలకలచెరువు మూడు రోడ్డుల సర్కిల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన మొదటి నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. యువగళం పాదయాత్రతో రాష్ట్ర ప్రజల అభిమానాన్ని పొందడం ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. అనంతరం పెద్ద ఎతున్న అన్నదాన కార్యక్రమం నిర్వహించి కేక్ కట్ చేసి బాణాసంచ పేలుస్తూ ఘనంగా సంబరాలు నిర్వహించి. నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
Reporter
Namitha News