నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23 : రెవెన్యూ వెబ్ల్యాండ్ సమస్యలను సమగ్రంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిరంతరం చర్యలు చేపడుతోందని,, ఇందులో భాగంగా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రెవెన్యూ వెబ్లాండ్ సమస్యలకు పరిష్కారం చూపుతూ.. మదనపల్లి, రాయచోటి సబ్ డివిజన్లో 10 వెబ్ ల్యాండ్ 1బి అడంగల్ పత్రాలకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆమోదం తెలిపారు. అన్నమయ్య జిల్లా రాయచోటి, మదనపల్లి సబ్ డివిజన్ల పరిధిలో గత అనేక సంవత్సరాలుగా సర్వే నంబర్ సవరణలు, సర్వే నంబర్ అడిషన్స్, అడంగల్ వివరాల సరిదిద్దడంపై పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చూపిన ప్రత్యేక చొరవతో ఏళ్ల తరబడి పరిష్కారం కాని పలు రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వెబ్ ల్యాండ్ సమస్యలను ప్రత్యేకంగా పరిశీలించి పరిష్కరించడంతో పాటు మదనపల్లి సబ్ కలెక్టర్, రాయచోటి ఆర్.డి.ఓ ఆమోదించిన 10 వెబ్ ల్యాండ్ 1B పత్రాలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్లోని కోర్ట్ హాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో 10 మంది రైతులకు వెబ్ ల్యాండ్ సమస్యలు పరిష్కరించి సంబంధిత 1B పత్రాలను జిల్లా కలెక్టర్ స్వయంగా రైతులకు అందజేశారు. మిగిలిన దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకుని పూర్తిస్థాయిలో పరిష్కారం కల్పిస్తామని పేర్కొన్నారు. మదనపల్లి సబ్ డివిజన్ రామసముద్రం,నిమ్మనపల్లె, గుర్రంకొండ, రాయచోటి సబ్ డివిజన్ క్రింద సంబేపల్లి తదితర గ్రామాలకు చెందిన పలు రెవెన్యూ సమస్యలకు సంబంధించి 1బి పత్రాలను నేడు జిల్లా కలెక్టర్ స్వయంగా రైతులకు అందజేశారు. అదే విధంగా 22ఏ భూమి సమస్యలకు సంబంధించి ఈ నెల మొదట వారం లో డెబ్బై రెండు, ఈ వారం లో డెబ్బై 22ఏ భూమి సమస్యలకు పరిష్కారం చూపడం జరుగుతుందని తెలిపారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మదనపల్లి, రాయచోటి సబ్ డివిజన్ పరిధిలో వెబ్ ల్యాండ్కు సంబంధించి వచ్చిన 10 దరఖాస్తులను సంబంధిత రెవెన్యూ రికార్డులు, పాత దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించినట్లు తెలిపారు. ముఖ్యంగా గత తొమ్మిది నుంచి పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కారం అందించేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకున్నదని తెలిపారు. భూమి రికార్డులు సరిగ్గా ఉండటం రైతులకు అత్యంత ముఖ్యమని, భూమి లావాదేవీలు, పంట రుణాలు మరియు ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో వెబ్ ల్యాండ్ రికార్డులు కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే జిల్లా పరిపాలన ముఖ్య లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా రెవెన్యూ శాఖ అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా రెవిన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు
Admin
Namitha News