Saturday, 18 April 2026 03:47:53 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

Date : 16 April 2026 10:06 PM Views : 57

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 ః గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ అంకితభావంతో పనిచేయాలని మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించారు. గురువారం ఆమె తాసిల్దార్ శ్రీనివాసులతో కలిసి మండలంలోని గుండ్లపల్లి సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాజరు రిజిస్టర్, రికార్డులు పరిశీలించారు, సచివాలయ ఉద్యోగుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు పంచాయతీలోని ప్రతి గ్రామం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. వేసవికాలం దృశ్య తాగునీటి సమస్యలపై శ్రద్ధ చూపాలని అదేవిధంగా పారిశుధ్యం మెరుగు, గ్రామీణ వైద్యం, ఉపాధి హామీ, మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు పై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అనంతరం భూముల రీ సర్వే పై క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించారు. రీ సర్వేలో రైతుల భూముల సమస్యల సామరస్యంగా పరిష్కరించి పరిస్థితి చేయి దాటితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి దారి చూపాలన్నారు. రీ సర్వే పూర్తి పారిదర్శకంగా నిర్వహించాలని సందేహాల నివృత్తికి ఉన్నతాధికారుల సలహాలు సూచనలు పాటించాలని రీ సర్వే బృందానికి సలహా ఇచ్చారు. రీ సర్వే పూర్తయిన తర్వాత ఖచ్చితమైన భూ వివరాలతో పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేయాలని తాసిల్దార్ కు సూచించారు. ఆమె వెంట ఆర్ఐ ముద్దుకృష్ణ, మండల సర్వేయర్ నాగరాజు, రీ సర్వే టిఏ రవి, వీఆర్వోలు నాగరాజు, ప్రభాకర్ విఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :