నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 ః గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ అంకితభావంతో పనిచేయాలని మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించారు. గురువారం ఆమె తాసిల్దార్ శ్రీనివాసులతో కలిసి మండలంలోని గుండ్లపల్లి సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాజరు రిజిస్టర్, రికార్డులు పరిశీలించారు, సచివాలయ ఉద్యోగుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. సచివాలయ ఉద్యోగులు పంచాయతీలోని ప్రతి గ్రామం క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలన్నారు. వేసవికాలం దృశ్య తాగునీటి సమస్యలపై శ్రద్ధ చూపాలని అదేవిధంగా పారిశుధ్యం మెరుగు, గ్రామీణ వైద్యం, ఉపాధి హామీ, మౌలిక సదుపాయాల కల్పనపై ఆరా తీశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు పై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అనంతరం భూముల రీ సర్వే పై క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించారు. రీ సర్వేలో రైతుల భూముల సమస్యల సామరస్యంగా పరిష్కరించి పరిస్థితి చేయి దాటితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి దారి చూపాలన్నారు. రీ సర్వే పూర్తి పారిదర్శకంగా నిర్వహించాలని సందేహాల నివృత్తికి ఉన్నతాధికారుల సలహాలు సూచనలు పాటించాలని రీ సర్వే బృందానికి సలహా ఇచ్చారు. రీ సర్వే పూర్తయిన తర్వాత ఖచ్చితమైన భూ వివరాలతో పట్టాదారు పాస్ బుక్కులు పంపిణీ చేయాలని తాసిల్దార్ కు సూచించారు. ఆమె వెంట ఆర్ఐ ముద్దుకృష్ణ, మండల సర్వేయర్ నాగరాజు, రీ సర్వే టిఏ రవి, వీఆర్వోలు నాగరాజు, ప్రభాకర్ విఆర్ఏలు, రైతులు పాల్గొన్నారు.
Reporter
Namitha News