నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : చౌడేపల్లి - డిసెంబర్ 17 : చౌడేపల్లి మండలం దుర్గ సముద్రం పంచాయతీ మైదానంలో గత నాలుగు రోజులుగా ఉపాధ్యాయులకు పలమనేరు డివిజనల్ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ఇందులో భాగంగా చివరి రోజున బుధవారం పుంగనూరు పెద్దపంజాణి మండలాలకు చెందిన ఉపాధ్యాయ టీములు తలపడ్డాయి ఇందులో పెద్దపంజాణి ఉపాధ్యాయ టీము విజయం సాధించింది పలమనేరు డివిజనల్ స్థాయిలో పది టీములు క్రికెట్ టోర్నమెంట్ ఆడగా చివరకు పెద్దపంజాణి మండల ఉపాధ్యాయ క్రికెట్ టీం విజయకేతం ఎగురవేసింది ఎంఈఓ లు కేశవరెడ్డి తిరుమలమ్మ ఆయా మండలాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Reporter
Namitha News