నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 08 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్) విభాగం ఆధ్వర్యంలో బి.టెక్ రెండో సంవత్సరం డేటా సైన్స్కు చెందిన 70 మంది విద్యార్థులు మరియు అధ్యాపకుల బృందం కలిసి ఇండస్ట్రియల్ విజిట్లో భాగంగా బెంగళూరులోని ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ కంపెనీని సందర్శించారు. విద్యార్థులకు పరిశ్రమ అనుభవం మరియు పరిశోధనలపై అవగాహన అందించడమే ఈ విజిట్ ప్రధాన లక్ష్యంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్లో డేటా అనలిటిక్స్ మేనేజర్గా పనిచేస్తున్న సగ్నిక్ బెనర్జీ డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ టెక్నాలజీలు వంటి తాజా సాంకేతిక పరిజ్ఞానాలపై అవగాహనాత్మకమైన మరియు ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థలో కొనసాగుతున్న పరిశోధనలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా అనలిటిక్స్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో మైక్రోసాఫ్ట్లో విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులు నూతన జెనెరేటివ్ ఏ.ఐ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని , భవిష్యత్ కెరీర్కు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్.ఎం. కిరణ్, రూపా, మంజుల మరియు డాక్టర్. జి. కిరణ్ కుమార్ ల బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News