నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 28 ః తంబళ్లపల్లెకు సమీపంలోని మల్లయ్య కొండలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి చెంతకు నిచ్చెనకొండ పవిత్ర పుణ్య జలాలు ఓ భక్తురాలు చేర్చడానికి సహకరించారు. ప్రతిరోజు స్వామివారి సేవకు కొండ మధ్యలో నిచ్చెనకొండ బిలం లోని పవిత్రమైన పుణ్య జలాలు కొండ మధ్య నిచ్చెన ఎక్కి జలాలను స్వామివారి సేవ కు వినియోగిస్తారు. మల్లయ్య కొండ టోల్గేట్ నిర్వాహకుడు గోపి కుమార్తె విజయలక్ష్మి తన తొలి జీతంతో నిచ్చెన కొండ నుండి కొండపైకి పుణ్య జలాలు ఏర్పాటుకు విద్యుత్ మోటారు తోపాటు పైకి పైప్ లైన్, స్టార్టర్ ఏర్పాటుకు సహకరించారు. ఈ పుణ్య కార్యానికి సహకరించిన గోపి కుమార్తె విజయలక్ష్మి,కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ ఈవో మునిరాజా, రికార్డు అసిస్టెంట్ కొండకిట్ట, అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు, శివ భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News