Thursday, 30 July 2026 08:59:40 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మిట్స్ విద్యార్థులకు కెరీర్ డెవలప్మెంట్ పై అవగాహన

Date : 29 January 2026 09:28 PM Views : 200

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 28 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) విభాగం వారు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం విద్యార్థులకు కెరీర్ మార్గాలపై అవగాహన కల్పించేందుకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చెన్నైకి చెందిన హెచ్‌సిఎల్ గువి సీనియర్ మేనేజర్ వి. లక్ష్మణ నారాయణన్ రిసోర్స్ పర్సన్‌గా హాజరై, విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. నేటి ఉద్యోగ అవకాశాల్లో డిగ్రీలతో పాటు కమ్యూనికేష స్కిల్స్, ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు. యాదృచ్ఛికంగా స్కిల్స్ నేర్చుకోవడం, కెరీర్ దిశపై స్పష్టత, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మెరుగుదల, ప్రాజెక్ట్ ఆధారిత అభ్యాసంపై దృష్టి పెట్టాలని సూచించారు. “ఉద్యోగాల వెనుక పరిగెత్తకండి… నైపుణ్యాలు మరియు వాటికి ఆధారాలు నిర్మించండి — అప్పుడు ఉద్యోగాలే మీ వెనుక వస్తాయి” అని అన్నారు. ఇంజనీరింగ్ చదువుతున్న సి.ఎస్.ఈ, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్, నెట్వర్క్స్ విద్యార్థులకు ప్రస్తుత ఆధునిక టూల్స్, ప్లాట్‌ఫార్మ్స్ మరియు పరిశ్రమలో అమలులో ఉన్న ఉత్తమ పద్ధతులపై యూనివర్సిటీ నందు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగయోగ్యత, అలాగే ఇంటర్న్‌షిప్స్ మరియు ప్లేస్‌మెంట్స్‌కు అవసరమైన సిద్ధతను మరింత మెరుగుపరుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఎస్. పద్మ, కోఆర్డినేటర్ ఎమ్.రాజేశ్వరి, శాయీజ్ అహమ్మద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: