Thursday, 30 July 2026 03:00:45 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లె లో పారిశ్రామిక వాడ స్థానిక ప్రజలకు ఓ వరం - తహసిల్దార్ శ్రీనివాసులు

Date : 11 November 2025 11:36 PM Views : 311

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 11 ః దశాబ్దాలుగా పూర్తిగా వెనుకబడిన తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక వాడ ఏర్పాటు తో స్థానిక ప్రజలకు ఓ వరం లా నిలుస్తుందని తంబళ్లపల్లె తాశీల్దార్ శ్రీనివాసులు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని కుక్కరాజుపల్లి సచివాలయ ప్రాంగణంలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎం ఎస్ ఎం ఈ ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమం జన సందోహం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్చువల్ గా రూ 7.70 కోట్ల తో ఏర్పాటు చేస్తున్న ఎం ఎస్ ఎం ఈ పార్క్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఏపీఐఐసీ ఐపిఓ శంకర్ మాట్లాడుతూ పారిశ్రామిక వాడ ఏర్పాటుకు కేటాయించిన 20.981 ఎకరాల ప్రభుత్వ భూముల్లో భూమి చదును చేయడంతో పాటు రోడ్లు, కాలువలు, నిరంతర విద్యుత్తు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ నాగార్జున మాట్లాడుతూ ఈ పారిశ్రామిక వాడ ఏర్పాటుతో పూర్తిగా వెనుకబడిన తంబళ్లపల్లి నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలతో పాటు భవిష్యత్తులో పరిశ్రమల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు మాట్లాడుతూ పారిశ్రామిక వాడ ఏర్పాటు స్థానిక ప్రజలకు ఆయువుపట్టుగా నిలిచి పరిశ్రమలకు బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తద్వారా మహిళా సంఘాలు చిన్న పరిశ్రమలు ఏర్పాటు తో జీవనోపాధి, స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలతో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి తోనప్ప మాట్లాడుతూ తంబళ్లపల్లె లో ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా పలువురికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని భవిష్యత్తులో ఈ పారిశ్రామిక వాడ స్థానిక ప్రజలకు మరింత చేరువలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు దోహదపడుతుందన్నారు. టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, తెలుగు యువత ఉపాధ్యక్షుడు నరసింహులు, మదన్ మోహన్, శేఖర్ రెడ్డి, ఆదిరెడ్డి లు మాట్లాడుతూ నాటి వైకాపా ప్రభుత్వం భూములు దోచుకుని రైతులు, ప్రజలను మోసం చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు, యువత, మహిళ, కార్మిక వర్గాల అభివృద్ధి కోసం హంద్రీనీవా జలాలు, పారిశ్రామిక వాడ తోబాటు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించిన ఘనత ఆయనకే దక్కినట్లు చెప్పారు. తంబళ్లపల్లె అభివృద్ధికి సహకరించడం హర్షనీయమని ఇది కూటమి ప్రభుత్వ విజయమని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఐకెపి ఎపిఎం గంగాధర్, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, వీఆర్వోలు నాగరాజు, సంజీవ్ కుమార్, సంఘమిత్ర సోమశేఖర్, పలు శాఖల అధికారులు, మహిళా సంఘాలు, కూటమి నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: