Saturday, 18 April 2026 03:47:47 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం

ఓట్ల కోసం ప్రజలకు మాయమాట్లే తప్ప అభివృధి ఎక్కడ - సిపిఐ మండల కార్యదర్శి డి రెడ్డి శేఖర్

Date : 17 April 2026 07:55 PM Views : 8

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : *చెంబకూరు నుండి మదనపల్లి మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన APSRTC బస్సు. చెంబకూరు రోడ్డు పట్ల పాలకులకు చిత్తశుద్ధి ఏది ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం ఓట్ల కోసం ప్రజలకు మాయమాట్లే తప్ప అభివృధి ఎక్కడ? సిపిఐ మండల కార్యదర్శి డి రెడ్డి శేఖర్ మదనపల్లి నుండి రామసముద్రం పోవు ప్రధాన రహదారి పెంచుపాడు సమీప ప్రాంతం రెక్కమాను వద్ద ఆర్టిసి బస్సు పంటపొలాలులోకి దూసుకుపోయిందని,గత కొన్ని సంవత్సరాలుగా మదనపల్లి నుండి రామసముద్రం పోవు రోడ్డు పాలకుల నిర్లక్ష్యానికి గురవుతుందని సిపిఐ మండల కార్యదర్శి డి రెడ్డి శేఖర్ ఆవేదన వ్యక్తంచేశారు. మదనపల్లి నుండి చెమ్మకూరు పోవు ప్రధాన రహదారి ప్రమాదకర మలుపులు ఉన్నవి,రోడ్డు మొత్తం గుంతల మాయమైపోయిందని,ఆసియా ఖండంలోనే మదనపల్లె టమోట మార్కెట్ ప్రసిద్ధిగాంచిందని,ఇలాంటి టమోటా మార్కెట్ కు పెంచుపాడు, చెం బుకూరు,రామసముద్రం ఈ ప్రాంతాల నుండి సుమారు 50% పైన పండిస్తారని, ఈ ప్రాంతంలో పండించిన టమోటా మొత్తం ఈ ప్రమాదకరమైన రోడ్డుపైనే రవాణా జరగాలని,రోజుకు కొన్ని వందల లోడ్లు ఈ రోడ్డు మీదనే మదనపల్లి మార్కెట్ కు తరలిస్తారని, రోజువారి కొన్ని వేల మంది ఉపాధి కోసం మదనపల్లి పట్టణానికి ఎదే రోడ్డుపైన ప్రయాణం చేస్తారని,ఇలాంటి రోడ్డుకు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా చేంబకూరు రోడ్డు పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదని,ఈ రోడ్డుకు డబుల్ రోడ్డు ఆవశ్యకత ఎంతైనా ఉంది కానీ సీపీఐ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక మార్లు కార్యక్రమాలు చేపట్టిన ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి మదనపల్లి నుండి రామసముద్రం వరకు డబుల్ రోడ్డు చేయాలని డిమాండ్ చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :