Tuesday, 09 June 2026 09:48:12 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

మసీదు కమిటీకి వక్ఫ్ బోర్డు భూములకు సంబంధం లేదు

వక్ఫ్ బోర్డు భూములపై రాజకీయం చేయడం తగదు - భూమి వారసులు

Date : 23 December 2025 08:03 AM Views : 109

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె కదిరి రోడ్డులోని వక్ఫ్ బోర్డు భూములకు జామియా మసీదు కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదని బాధితులు నూర్జహాన్ బేగం, శవాల్ బేగం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం వారు తమ స్వగృహం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అవుతున్నట్లు మసీదు పెద్దలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అయితే వక్ఫ్ బోర్డు భూములు పూర్వీకుల నుంచి తమకు సంక్రమించాయని, ఇందులో ఎలాంటి కబ్జాలు లేవన్నారు. గత ప్రభుత్వాలు వక్ఫ్ బోర్డు చట్టప్రకారం సగం భూమి వక్ఫ్ బోర్డుకు, మిగతా సగం భూమి తమ పూర్వీకులకు కేటాయించారన్నారు. అయితే వక్ఫ్ బోర్డు భూముల వివాదం తెరపైకి రావడంతో కోర్టులో కేసు వేశామన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోందని అక్కడే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా న్యాయస్థానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. వక్ఫ్ బోర్డు భూమిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని కమిటీ పెద్దలు భూముల అన్యాక్రాంతంపై చర్చకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు భూముల అన్యాక్రాంతం, దురాక్రమణ, ఇతర అంశాలపై కోర్టులో కేసు వేశామని వివరించారు. కోర్టు కేసుపై ఎవరూ జోక్యం చేసుకోకూడదన్నారు. న్యాయస్థానం తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. అయితే ఈ భూములకు కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వక్ఫ్ బోర్డు భూములపై రాజకీయం చేయడం తగదన్నారు. కమిటీ పెద్దలు రాజకీయ కోణంలో ఆలోచిస్తూ వక్ఫ్ బోర్డు భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది తమ పూర్వీకులు కొనుక్కున్న భూమని వారినుండీ సంక్రమించిన ఈ భూమికి తామే వారసులమన్నారు. ఈ భూమితో కమిటీ పెద్దలకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అనవసరంగా జోక్యం చేసుకుని రాజకీయ రంగు పులిమారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :