నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 09 : మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు ఆర్.జె. వెంకటేష్ వారి మాతృమూర్తి రాటకొండ సీతా దేవి గారు వృద్దురాలు వయసు రీత్య అకాలమరణం. వీరి మరణం రాటకొండ కుటుంబం పెద్ద దిక్కు ను కోల్పోయిన ఘటన. సీతా దేవి పార్థివ దేహం ను వారి స్వగ్రామం నిమ్మనపల్లె మండలం ఆచార్లపల్లె గ్రామం లో వారి నివాసం వద్ద కు చేరుకొని సీతా దేవి గారికి ఘన నివాళులు అర్పించిన స్థానిక తెలుగుదేశం నాయకులు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చినబాబు, మదనపల్లి సీనియర్ టీడీపీ నేత బాబు రెడ్డి తదితరులు ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బాబు రెడ్డి ,సీడ్ మల్లికార్జున,దొరస్వామి నాయుడు,రాటకొండ విష్ణు,బండి అమర తెలుగుయువత నాయకులు మహబూబ్ ఖాన్, ప్రభు గౌడ్,శ్యామ్ బీజేపీ నాయకులు శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News