Thursday, 16 April 2026 04:25:13 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ఇక్కడి రోడ్లు చూడండి మంత్రి గారు - వైసీపీ ఇంచార్జ్ నిసార్ అహమ్మద్

మదనపల్లె టౌన్‌ లో రహదారి వెడల్పుపై దృష్టి సారించండి - మదనపల్లె వైసిపి సమ

Date : 19 November 2025 07:46 PM Views : 60

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లెకు వచ్చారు... ఇక్కడి రోడ్లు చూడండి -- మదనపల్లె టౌన్‌లో రహదారి వెడల్పుపై దృష్టి సారించండి -- రోడ్లు భవనాల శాఖ మంత్రిని కోరిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ -- మదనపల్లె మున్సిపాలిటీ 30 వ వార్డులో కోటి సంతకాల రచ్చబండ మదనపల్లె రోడ్ల దుస్థితిపై దృష్టి సారించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రిని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ కోరారు. ‌బుధవారం మదనపల్లె మున్సిపాలిటీ 30 వార్డులో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్, పరిశీలకులు అనూష రెడ్డి ముఖ్య అతిధిలుగా విచ్చేశారు. ‌ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లెలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని వాటిపై దృష్టి సారించాలని రోడ్లు భవనాల శాఖ మంత్రిని కోరారు. వై జంక్షన్ శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం వద్ద నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు ప్రయాణం చేయాలంటే తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు. నిత్యం వివిధ పనుల మీద ఇతర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు ఇక్కడి రోడ్ల పరిస్థితిపై చర్చించడం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా బాహుదా కాలువ పై కొత్తగా బ్రిడ్జ్‌ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పట్టణం రోడ్లు వెడల్పు ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. బెంగుళూరు రోడ్డుకు బైపాస్ వేయాలని, తద్వారా పట్టణంలో ట్రాఫిక్ తగ్గుతుందని సూచించారు. ‌మదనపల్లె నుంచి రామసముద్రం, నిమ్మనపల్లె, బెంగుళూరు రహదారి గుంతల మాయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రిగా కాకుండా జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా వీటిపై కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ‌వైద్య కళాశాలు పిపిపి విధానంలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేదలకు వైద్యం అందించే మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఆధునిక యంత్ర పరికరాలు గుంటూరుకు తరలింపు సమంజసం కాదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ పధకం నేడు నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‌నెట్ వర్క్ ఆసుపత్రులకు గ్రాంట్ చెల్లింపు సక్రమంగా లేక చాలా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ నిరాకరించి పేదలకు వైద్య అందించడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో‌ అనూష రెడ్డి, తట్టి శ్రీనివాసులు రెడ్డి, సరిత, డా. అనిల్ రెడ్డి, ప్రసాద్ బాబు, ఈశ్వర్ నాయక్, బాలగంగాధర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, రవి, రఫీ, మాధవరెడ్డి, శారదా రెడ్డి, యూనస్, ఎన్. నవాజ్ అలీ ఖాన్, వినీతా బాయి పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :