Thursday, 16 April 2026 06:08:12 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

తంబళ్లపల్లె అభివృద్ధికి విజన్ 2047 భవిష్యత్ ప్రణాళిక - స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి

Date : 30 March 2026 08:46 PM Views : 140

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 30 : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2047 విజన్ భవిష్యత్తు ప్రణాళికలతో ముందడుగు వేయడానికి సహకరించాలని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో 2017 విజన్ మరియు పి4 పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె అభివృద్ధికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి అభివృద్ధి పనుల ప్రణాళికలను అధికారులు గుర్తించి నివేదికలు ఇవ్వాలని సూచించారు. మండలాల వారిగా ఏడాదిగా పి4 కార్యక్రమం ద్వారా చేపట్టిన అంశాలపై చర్చించారు. పి 4 కార్యక్రమంలో పేదరిక నిర్మూలనలో భాగంగా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి మార్గదర్శకులను గుర్తించాలన్నారు. వారిని గుర్తించి భవిష్యత్తులో పేదరికం రూపుమాపడానికి సహకరించాలన్నారు. 20 47 విజన్ లో భాగంగా మండలాలలో అన్ని శాఖల అధికారులు తాగునీరు, సాగునీరు, రోడ్లు, వ్యవసాయం, ఉపాధి, ఐకెపి, హౌసింగ్, పశుసంవర్ధక శాఖ, శిశు సంక్షేమం, హార్టికల్చర్, సిరికల్చర్, విద్యుత్, సూర్య ఘర్, మౌలిక సదుపాయాల కల్పన తోపాటు పలు సమస్యలపై క్షేత్రస్థాయిలో గుర్తించాలని సూచించారు. అనంతరం కురబలకోట మండలానికి చెందిన పి4లో 129 కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శకులు కాకర్ల సుధీర్, శెట్టి సీతారాం, గుర్రాల మనోజ్ కుమార్ లను ప్రభుత్వం తరఫున స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్,పశుసంవర్ధక శాఖ ఏడి సుమిత్ర, పంచాయతీ రాజ్ డి ఈ మునిరాజ్, సిడిపిఓ సుజాత,ఏపీఎం గంగాధర్, 20 47 విజన్ అధికారి రెడ్డప్ప, సభ్యులు,ఆరు మండలాల ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏఈ లు, అధికారులు, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, మాజీ జెడ్పిటిసి రామచంద్రలు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :