Tuesday, 09 June 2026 09:38:06 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె అభివృద్ధికి విజన్ 2047 భవిష్యత్ ప్రణాళిక - స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి

Date : 30 March 2026 08:46 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 30 : తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2047 విజన్ భవిష్యత్తు ప్రణాళికలతో ముందడుగు వేయడానికి సహకరించాలని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో 2017 విజన్ మరియు పి4 పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె అభివృద్ధికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి అభివృద్ధి పనుల ప్రణాళికలను అధికారులు గుర్తించి నివేదికలు ఇవ్వాలని సూచించారు. మండలాల వారిగా ఏడాదిగా పి4 కార్యక్రమం ద్వారా చేపట్టిన అంశాలపై చర్చించారు. పి 4 కార్యక్రమంలో పేదరిక నిర్మూలనలో భాగంగా వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి మార్గదర్శకులను గుర్తించాలన్నారు. వారిని గుర్తించి భవిష్యత్తులో పేదరికం రూపుమాపడానికి సహకరించాలన్నారు. 20 47 విజన్ లో భాగంగా మండలాలలో అన్ని శాఖల అధికారులు తాగునీరు, సాగునీరు, రోడ్లు, వ్యవసాయం, ఉపాధి, ఐకెపి, హౌసింగ్, పశుసంవర్ధక శాఖ, శిశు సంక్షేమం, హార్టికల్చర్, సిరికల్చర్, విద్యుత్, సూర్య ఘర్, మౌలిక సదుపాయాల కల్పన తోపాటు పలు సమస్యలపై క్షేత్రస్థాయిలో గుర్తించాలని సూచించారు. అనంతరం కురబలకోట మండలానికి చెందిన పి4లో 129 కుటుంబాలను దత్తత తీసుకున్న మార్గదర్శకులు కాకర్ల సుధీర్, శెట్టి సీతారాం, గుర్రాల మనోజ్ కుమార్ లను ప్రభుత్వం తరఫున స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్,పశుసంవర్ధక శాఖ ఏడి సుమిత్ర, పంచాయతీ రాజ్ డి ఈ మునిరాజ్, సిడిపిఓ సుజాత,ఏపీఎం గంగాధర్, 20 47 విజన్ అధికారి రెడ్డప్ప, సభ్యులు,ఆరు మండలాల ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏఈ లు, అధికారులు, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, మాజీ జెడ్పిటిసి రామచంద్రలు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :