Friday, 31 July 2026 02:31:49 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

సిపిఐ శతాబ్ధి ముగింపు ఉత్సవాలు కరపత్రాలు విడుదల

ఖమ్మం లో జనవరి 18వ తేదీ ముగింపు సభ ను జయప్రదం చేయండి- సిపిఐ అన్నమయ్య సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప

Date : 11 January 2026 07:51 PM Views : 343

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - జనవరి 11 : జనవరి 18వ తేదీ ఖమ్మం నగరం నందు సిపిఐ శతాబ్ది ఉత్సవాల కరపత్రాలు విడుదల చేశారు ఈసందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 2026 జనవరి 18 న ఖమ్మంలో లక్షలాది మందితో బహిరంగసభ జరుగుతున్నదని పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు* *1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ) భారత గడ్డపై వందేళ్ళు పూర్తి చేసుకుంటున్నదాని. భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని తొలుత గర్జించిన ఏకైక పార్టీ (సిపిఐ) శత వసంత ఉత్సవాలు పార్టీ ఆవర్భవించిన కాన్పూర్ 2024 డిసెంబర్ 26న ప్రారంభమై దేశ వ్యాపితంగా ఉత్సవాలు ఉత్సాహపూరితంగా జరుగుతున్నాయనీ. బ్రిటీష్ వారి నుండి మన దేశ విముక్తి కొరకు రాజీలేని పోరాటాలు చేస్తున్నందునే ఆనాడు పార్టీపై నిషేధం విధించారు, కాన్పూర్, మీరట్, పెషావర్ తదితర కుట్ర కేసులు పెట్టి నాయకులను జైళ్ళలో నిర్భందించారు. అయినప్పటికీ కార్మిక, విద్యార్ధి, యువజన, రైతు, మహిళా తదితర ప్రజా సంఘాలను నిర్మించి వెట్టిచాకిరి విముక్తి కొరకు, కార్మికులు, కర్షకులను దోపిడి నుండి విముక్తి చేయడానికి రాజీలేని పోరాటాలు సి.పి.ఐ. నిర్వహించింది. ఈ శతాబ్దకాలంలో ఎన్నో పోరాటాలు, ఎనెన్నో త్యాగాలు ఎంతో మంది అమరవీరుల రక్త తర్పరణతో ఎన్నెన్నో విజయాలు సాధించి భారతదేశ రాజకీయ చరిత్రలో సి.పి.ఐ. తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది* భూమికోసం, భుక్తికోసం నిరంకుశ నిజాంను గద్దె దించడానికి జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేలమంది ప్రాణ త్యాగాలతో, మూడువేల గ్రామాల విముక్తి, 10 లక్షల ఎకరాలభూమిని పంచిన చరిత్ర భారత కమ్యునిస్టుపార్టీది. పున్నప్రవాయిలర్, తెభాగ లాంటి వీరోచిత పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యునిస్టు పార్టీది. ఫలితంగానే పాలకులు భూసంస్కరణ చట్టం, గరీభీహఠావో, బ్యాంకుల జాతీయకరణ అనేక సంస్కరణలను చేయాల్సివచ్చింది. పోరాటాల ద్వారా దేశంలో అనేక కార్మిక సంక్షేమ చట్టాలను సాధించింది కమ్యూనిస్టుపార్టీ అని తెలిపారు ఈకార్యక్రమ సిపిఐ మండల కార్యదర్శి కే అంజనప్ప సహాయ కార్యదర్శి ఎస్ నిజాముద్దీన్ ‌ చంద్ర లక్ష్మన్న చౌడప్ప శంకరమ్మ రమణమ్మ రామప్ప ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: