నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 22 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా తంబళ్లపల్లె మోడల్ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ జే.శివకుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ఎన్నికపై జే.శివకుమార్ మాట్లాడుతూ నాకు సహకరించిన ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ భవిష్యత్తులో ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని, విద్యార్థుల విద్య తోపాటు మౌలిక సదుపాయాల కల్పన లో రాజీ పడకుండా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి వారధిగా నిలిచి ఉపాధ్యాయుల సహాయ, సహకారాలతో అలుపెరగని పోరాటం చేస్తానన్నారు. రాష్ట్ర స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన జే. శివ కుమార్ ను స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి, ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా,పాఠశాల ఎస్.ఓ హేమంత్ కుమార్, ఎంఈఓ లు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, పాఠశాల అధ్యాపకులు, మండలంలోని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తర్వాత రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సంఘ పదవి పొందడం జే.శివకుమార్ పనితీరు, అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు
Reporter
Namitha News