నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 20 : అంగళ్ళు సమీపంలో ని మిట్స్ డీమ్డ్ టూ బి యూనివర్సిటీ లో ఎన్.సి.సి. క్యాడట్స్ బి సర్టిఫికెట్, సి సర్టిఫికెట్ క్యాడట్స్ వారి తల్లితండ్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎన్.సి.సి. కెప్టెన్ డాక్టర్ ఎన్. నవీన్ కుమార్ మాట్లాడుతూ మిట్స్ నందు ఎన్.సి.సి. క్యాడట్స్ సాధించిన పథకాలు గురించి, అదేవిదంగా ఎన్.సి.సి. లో చేరడం వలన కలిగే ప్రయోజనాలు, వారికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరడానికి వారికి ఎలా ఉపయోగపడుతుంది, ఉన్నత చదువులలో రిజర్వేషన్, ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ వంటి అంశాల గురించి తెలుపుతూ, మిట్స్ యూనివర్సిటీ నందు ఎన్.సి.సి. విద్యార్థులు సాధించిన విజయాలు, వారు దేశ వ్యాతంగా పాల్గొన్న క్యాంపులు, దాని వలన వారికి వచ్చిన సర్టిఫికెట్స్, యూనివర్సిటీ కి వచ్చిన గుర్తింపు గురించి వివరించారు. అదే విదంగా ఎన్.సి.సి. లో విద్యార్థులు చేరడం వలన వారిలో క్రమశిక్షణ, దేశానికి సేవ చేయాలనే ఆలోచన విధానం అలవడుతాయని, ప్రస్తుతం చాలా మంది ఇంజనీరింగ్ తరువాత సాఫ్ట్ వేర్ రంగం లో ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం కూడా తప్పు అని, ఇంజనీరింగ్ తో పాటు ఎన్.సి.సి. లో సి సర్టిఫికెట్స్ పొందడం వలన వారికి అర్మడ్ ఫోర్సస్ లలో చేరడానికి సులువుగా ఉంటాదని, విద్యార్థుల తల్లితండ్రులకు తెలిపారు. సమావేశంలో ఎన్.సి.సి. కో ఆర్డినేటర్ పూజారి రాజేష్, ఎన్.సి.సి. క్యాడట్స్, వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.
Reporter
Namitha News