నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలి విద్యార్థులు ప్రణాళికతో చదివి లక్ష్యాలను అధిగమించాలని బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవరెడ్డి సూచించారు. సోమవారం స్థానిక శ్రీ చౌడేశ్వరి దేవి కళ్యాణ మండపము నందు పాఠశాల 26వ వార్షికోత్సవ కరస్పాండెంట్ మొరుంపల్లి సహదేవ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు మొరుంపల్లి రజనిల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సహదేవరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. ఉన్నత చదువులకు పోయే కొద్దీ సరైన ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగితే లక్ష్యాలను అధిగమించవచ్చునన్నారు. తమ పాఠశాలలో విద్యతోపాటు సామాజిక స్పృహ, దేశభక్తి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు,యోగ వంటి అంశాలపై విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామన్నారు. సీనియర్లు, జూనియర్లకు ప్రేరణగా నిలవాలన్నారు.చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉపాధ్యాయులు బోధించే పాఠాలను చక్కగా అలవర్చుకొని,తల్లిదండ్రుల సూచనలు పాటించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. పాతికేళ్లుగా తమ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం గర్వంగా ఉందన్నారు. మా సుదీర్ఘ ప్రయాణంలో పాఠశాలాభివృద్ధికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు,కృషి ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సహదేవ రెడ్డి, రజనిల నృత్యం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Reporter
Namitha News