నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 12 : పవిత్ర రంజాన్ మాసంలో 25వ రోజు ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే సతామి పండుగ మార్చి 15వ తేదీ నిర్వహిస్తున్న సందర్భంలో నేడు ముస్లింల బరియల్ గ్రౌండ్ ను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించడం కోసం ఎమ్మెల్యే షాజహాన్ భాష స్మశానంలో పర్యటించారు. జరుగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ ప్రమీల తో కలిసి పరిశీలించి 15వ తేదీ సాయంత్రానికి పారిశుద్ధ్య పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పురుషోత్తం, గురునాథ యాదవ్, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, రెడ్డి రాయల్, నయాజ్, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News