Thursday, 16 April 2026 04:22:16 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ప్రసన్న వెంకటేశ్వరుడిని దర్శించుకొన్న బిజెపి నేత, టి.టి.డి. బోర్డు మెంబర్ భానుప్రకాష్

ఆలయం అభివృద్ధికి సహకారం అందిస్తాం - టి.టి.డి.పాలకమండలి సభ్యులు భానుప్రకాష్

Date : 27 January 2026 09:02 PM Views : 86

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 27 : తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి పురాతన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయ అభివృద్ధికి సహకరించాలని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ని కూటమి నాయకులు కోరారు. మంగళవారం టిటిడి బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి ని కోసువారిపల్లి స్వామివారి బ్రహ్మోత్సవాలకు టిటిడి అధికారులు, కూటమి నాయకులు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకున్నారు. టిటిడి ప్రధాన అర్చకులు కృష్ణస్వామి, రమేష్ స్వాములు వెంకటేశ్వర స్వామికి భాను ప్రకాష్ రెడ్డి, చల్లపల్లి నరసింహారెడ్డి ల పేరుతో ప్రత్యేక పూజలు, అర్చనలు అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు టిటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల నిర్వహణ, భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు 2010 లో టీటీడీ పరమైన ఈ పురాతన ఆలయానికి నూతన కళ్యాణమండపం, పుష్కరిణి, ఆలయంలో ఇద్దరు వేద పండితులు, స్వీపర్లు, వసతి గృహాలు, నూతన తేరు, ఏర్పాటు చేసి తంబళ్లపల్లె మండలంలో ఆలయాల సముదాయం ఉన్నందున పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని కోరారు. టిటిడి ఆలయానికి సంబంధించిన సమస్యలను టిటిడి బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ బ్రహ్మోత్సవాల నిర్వహణలో అధికారులు, అర్చకులు, స్థానిక నాయకులు చేసిన కృషిని కొనియాడారు. వారి వెంట బిజెపి, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :