నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్టు 01 : విద్యుత్ శాఖ డి ఈ గంగాధరం ఆదేశాల మేరకు తంబళ్లపల్లె మండలంలో ఈ నెల ఆరో తేదీన ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ సురేంద్ర తెలిపారు. తంబళ్లపల్లె విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణంలో ఆరవ తేదీ జరిగే విద్యుత్ అదాలత్ కు రిటైర్డ్ న్యాయమూర్తి వి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు జి మధు కుమార్, సాంకేతిక సభ్యు లు ఏ శ్రీనివాస బాబు, స్వతంత్ర సభ్యులు డబ్ల్యూ విజయలక్ష్మి హాజరవుతారని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యల పరిష్కార వేదిక పంచుకొని తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. అదేవిధంగా ఆదివారం తంబళ్లపల్లె పట్టణంలో ఉదయం 10గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఆర్ డి ఎస్ ఎస్ కు సంబంధించిన విద్యుత్ పనులు జరుగుతున్న దృశ్య విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని వినియోగదారులు సహకరించాలని తెలిపారు.
Reporter
Namitha News