నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 19 : తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఇంచార్జ్ లేక తమ సమస్యలు పరిష్కారానికి దిక్కు లేకుండా పోయిందని మా సమస్యలు పరిష్కరించాలని తంబళ్లపల్లె టిడిపి సీనియర్ నేతలు బేరి శ్రీనివాసులు, ముద్దలదొడ్డి వెంకట్ రెడ్డి, ఐ టి డి పి వినోద్ కుమార్ లు గురువారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర రెవిన్యూ, ఎక్సైజ్ శాఖల మంత్రులు అనిగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్రలను కోరారు. ఇరువురు మంత్రులు స్పందించి తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటని త్వరలో ప్రజామోదం పొందే నాయకుడిని ఇన్చార్జిగా అధిష్టానం నియమిస్తుందని నాయకులు, కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Reporter
Namitha News