Thursday, 30 July 2026 07:18:32 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అట్టహాసంగా శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం

- ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం - ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శ్రీహరి,డాక్టర్ భారతిలు స్పష్టం

Date : 27 February 2026 02:46 PM Views : 188

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అట్టహాసంగా శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం - ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే లక్ష్యం - ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ శ్రీహరి,డాక్టర్ భారతిలు స్పష్టం - హాజరైన వివిధ పార్టీల నాయకులు,పుర ప్రముఖులు గ్రామీణ,పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు,ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీహరి (ఎం.ఎస్),డాక్టర్ భారతిలు పేర్కొన్నారు.శుక్రవారం అన్నమయ్య కేంద్రమైన మదనపల్లి పట్టణం,సొసైటీ కాలనీ,రెండవ మెయిన్ నందు అధునాతన హంగులతో నిర్మితమైన నూతన భవనంలో ఆసుపత్రిని అట్టహాసంగా ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవానికి వివిధ పార్టీల నాయకులు,పుర ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ తాను గతంలో బెంగళూరు మణిపాల్ ఆసుపత్రి నందు జనరల్ సర్జనుగా పనిచేశానన్నారు.అనంతరం మదనపల్లి పట్టణంలో కదిరి రోడ్డు,రాఘవేంద్ర బుక్ స్టాల్ పక్కన ఉన్న భవనం నందు శ్రీ సాయి హాస్పిటల్ సేవలు ప్రారంభించడం జరిగిందన్నారు.మా ఆసుపత్రి నందు అన్నిరకాల జబ్బులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు.ముఖ్యంగా ల్యాప్రోస్కోఫిక్ శస్త్రచికిత్సలు,క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్స,అధునాతన సాంకేతిక విధానంతో నిర్వహించడం మా ప్రత్యేకత అన్నారు.అదేవిధంగా షుగర్ సంబంధిత జబ్బులకు ప్రత్యేక వైద్యం అందించబడుతుందన్నారు.దంతవైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.24×7 ప్రజలకు వైద్యసేవలు అందుతాయన్నారు.నూతన భవనంలో వైద్యసేవలు ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని,తక్కువ ఫీజులతో ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడమే తమ సంకల్పమన్నారు.మా ఆహ్వానం మేరకు ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులు,రాజకీయ ప్రముఖులు,ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.అనంతరం అందరికీ విందు భోజనం వడ్డించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :