నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 : 2027 జనగణన స్వీయ నమోదు కార్యక్రమం ద్వారా ఓటర్ నమోదు విధానం సులభతరమని తాసిల్దార్ శ్రీనివాసులు సూచించారు. గురువారం తంబళ్లపల్లె జూనియర్ కళాశాలలో జన గణన పై అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం నేటి నుండి 30వ తేదీ వరకు 15 రోజులపాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ జాతీయ జనగణన స్వీయ నమోదు పై అధికారులు పారదర్శకంగా పని చేయాలని సూచనలు చేశారు. 15 రోజులు పాటు విభిన్న వర్గాలను లక్ష్యంగా చేసుకొని ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, కార్మికులు, వృద్ధులు అన్ని వర్గాల పై దృష్టి సారిస్తూ అవగాహన ప్రచారం జోరు పెంచాలన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్ 20 27 జనగణన స్వీయ నమోదు తో పాటు సర్వే నిర్వహణపై అధికారులకు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News