Thursday, 30 July 2026 12:56:14 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

హార్సిలీహిల్స్ నందు మిట్స్ యూనివర్సిటీ యన్.సి.సి. విద్యార్థుల ట్రెక్కింగ్

Date : 21 December 2025 06:52 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 21 : అంగళ్లు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ యన్.సి.సి. క్యాడెట్స్ స్థానిక హార్సిలీ హిల్స్ నందు ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందు లో బాగంగా యూనివర్సిటీలోని యెన్.సి.సి క్యాడెట్స్ ఉదయం హార్సిలీ హిల్స్ పైకి చేరుకున్నట్లు ఎన్.సి.సి లెఫ్టినెంట్ ఎన్ నవీన్ కుమార్ తెలిపారు. దేశ రక్షణ కొరకై అత్యవసర సమయాలలో ప్రతి ఒక్కరిని కాపాడుటకు వీలుగా క్యాడెట్స్ ట్రైనీ అయి ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారని ఆయన అన్నారు. యూనివర్సిటీ యెన్ సి సి క్యాడెట్స్ సుమారు 100 మంది ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమం పాల్గొన్నారని ఆయన అన్నారు. విద్యార్థులకు రోప్ హ్యాండ్లింగ్, హిల్ క్లిబింగ్ మొదలైన వాటిపై శిక్షణను అందజేశామని ఉదయం 7 గంటలకు ప్రారంభించి 11 గంటలకు చేరుకున్నట్లు ఆయన అన్నారు. హిల్స్ లో క్యాడెట్స్ కు సి సెరిటిఫికేట్, బి సర్టిఫికెట్ల పై అవగాహన కల్పించారు. కార్యక్రమం లో యెన్ సి సి సుబేదార్ మేజర్ సంజు ఖడా, పర్మనెంట్ ఇన్స్ట్రక్టర్ హవల్దార్ డి ఎన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినంట్ కల్నల్ పి.లోగనాథన్, 35 ఆంధ్ర బెటాలియన్, చిత్తూర్ వారికి యెన్.సి.సి ఆఫీసర్ కెప్టెన్ ఎన్.నవీన్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :