నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 04 : రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట శ్రీరామరక్షగా నిలిచినట్లు టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ సీనియర్ నాయకుడు బేరిపల్లి శ్రీనివాసులు కొనియాడారు. శనివారం కోసువారిపల్లి పంచాయతీలో పలువురు తమ ఆరోగ్యాలు క్షీణించి ఆర్థిక స్తోమత లేక మెరుగైన చికిత్సలు చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను బేరి శ్రీనివాసులు ఇంటింటికి తిరిగి పంపిణి చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి తో మాకుటుంబాలు ఉపశమనం పొందామని జీవితకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. చెక్కుల పంపిణీ కార్యక్రమం లో టిడిపి నాయకులు కృష్ణమూర్తి, కేశవరెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు
Reporter
Namitha News