నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 12 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ (MITS Deemed to be University)లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఫుల్ టైం (Full Time) మరియు పార్ట్ టైమ్ (Part Time) పీహెచ్.డి కార్యక్రమాలలో ప్రవేశాల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. యూనివర్సిటీ ప్రాంగణం లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ స్టడీస్, గణితశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం మరియు ఇంగ్లీష్ విభాగాలలో పీహెచ్.డి ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. విశ్వవిద్యాలయ నిబంధనలు, అర్హత ప్రమాణాలు, ప్రవేశ పరీక్ష (మిట్స్ డాక్టోరల్ అడ్మిషన్స్ టెస్ట్ MITSDAT-2026), ఇంటర్వ్యూ మరియు ఇతర నియమావళి ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించబడతాయని ఆయన అన్నారు. ఈ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 25-06-2026 అని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ వెబ్సైట్ www.mits.ac.in ను సందర్శించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7416484422, 9100973262 నంబర్లను సంప్రదించవచ్చని రిజిస్ట్రార్ అన్నారు. ఈ కార్యక్రమం లో అడ్వైసర్ ఆర్&డి డాక్టర్ తులసీరామ్ నాయుడు, అసోసియేట్ డీన్ డాక్టర్ నంద కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు
Reporter
Namitha News