నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 25 : అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని చమర్తి ఆదేశించారు. మంగళవారం విద్యుత్ నగర్ 21వ వార్డు నందు బోర్ వెల్ వేయించి తద్వారా త్రాగునీటి సమస్యను తీర్చిన తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జ్ జగన్ మోహన్ రాజు ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ తాగునీటి సమస్యలు రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.నీటి వృథాపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా ఆయన ఆదేశించారు. అదేవిధంగా అడిగిన వెంటనే స్పందించి దాహార్తిని తీర్చిన చమర్తికి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ అధ్యక్షులు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, సీనియర్ నాయకులు గుగ్గిళ్ళ హరిప్రసాద్, గుగ్గిళ్ల చంద్రమౌళి, క్లస్టర్ ఇంచార్జ్ కొల్లి రెడ్డయ్య, కౌన్సిలర్ తుపాకుల అశోక్, గుణకల చిన్న, తోట నవీన్ కుమార్, సంగరాజు నరసింహారాజు, కోనేటి రమణ, కుంచపు వెంకటస్వామి,భాను నందు, హరిచరణ్, విద్యుత్ నగర్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Reporter
Namitha News