నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 18: మదనపల్లి పట్టణం కు సమీపంలోని కొత్తవారి పల్లి లోనున్న ప్రకృతివనం లో 18వ ఇషా గ్రామోత్సవాలను ముఖ్య అతిధిలు ప్రకృతివనం వ్యవస్థాపకులు శ్రీమతి యోగితా ప్రసాద్, విజయభారతి విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ సేతు నల్లూస్వామి, ప్రముఖ వైద్యులు డాక్టర్ సిద్ధారెడ్డి ల ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామీణ భారతదేశం లోని ప్రముఖ క్రీడల స్ఫూర్తిని, సామాజిక ఐక్యత, గ్రామీణ సంస్కృతి, గ్రామీణ పూర్వవైభవాన్ని పరిరక్షిస్తూ క్రీడాకారులను ప్రోత్సాహంచే విశిష్ట వేదికగా గ్రామీణ యువత లో నున్న ప్రతిభను వెలికితీసే ఆరోగ్యకరమైన పోటీల ప్రాముఖ్యతను సంతరించుకొందని తెలిపారు. ఈ పోటీలలో సుమారు 30జట్లుకు పైగా పాల్గొన్నాయని, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ క్రీడా స్పూర్తితో పాల్గొనాలని సూచించిన ఇషా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ అజంతుల్లా ఖాన్, ఐశ్వర్య, కిషోర్, హర్షిత, అదీప్, అశోక్, దామోదర్, గ్రామపెద్దలు, యువకులు, పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News