నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 : తంబళ్లపల్లె మండలంలో వేసవిలో తీవ్ర తాగునీటి సమస్యల పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ డిఈ చంద్రశేఖర్ రెడ్డిని టిడిపి నేతలు కోరారు. సోమవారం ఆయన ఎఈఈ వినోద్ కుమార్ తో టిడిపి నేతలతో సమీక్షించారు. బాలిరెడ్డిగారిపల్లి పంచాయతీలోని ఐదు గ్రామాలు, రెడ్డి కోటతో 10 గ్రామాల్లో తాగునీటి సమస్యల వివరాలను డీఈ కి టిడిపి నేతలు వివరించారు. అధికారులు తాగునీటి సమస్యలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ నిధులు నుండి ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. అదేవిధంగా తంబళ్లపల్లె లో బహిరంగ మరుగుదొడ్లు నిర్మించాలని సూచించారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి జిల్లా సీఈవో తోపాటు కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ విషయమై డిఇ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత క్రమంలో కృషి చేస్తామని ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు సహకరించాలన్నారు. ఈ సమీక్షలో టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, వెంకట్రెడ్డి,బిఎంఆర్, మదన్ మోహన్, రామచంద్ర, సిద్ధమ్మ, పురుషోత్తం, వీరాంజనేయులు, రామచంద్రారెడ్డి, శంకర, జనసేన నరసింహులు పాల్గొన్నారు.
Reporter
Namitha News