నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో జాతీయ సమైక్యతా దినోత్సవం అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో బుధవారం(19-11-2025) ఎన్. ఎస్. ఎస్. ఆధ్వర్యంలో జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ ప్రజల మధ్య సోదర భావం మానవత్వం, సమైక్యత, దేశభక్తి, సామజిక విలువలు ఎక్కడ ఉంటాయో అక్కడ శాంతి భద్రతలు వుంటాయని, భారత దేశ తొలి మహిళా ప్రధాన మంత్రి అయిన శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా నవంబర్ 19 న జాతీయ సమైక్యతా దినోత్సవం జరుపుకొంటారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ టి. ఎస్. గౌస్ భాషా మాట్లాడుతూ భాషా, మతం అనే బేధాలు లేకుండా అందరూ కలసి కట్టుగా జీవించాలని తెలిపారు. ఎన్. ఎస్. ఎస్. కోఆర్డినేటర్ అర్షద్ అలీ మాట్లాడుతూ ఎన్. ఎస్. ఎస్ విద్యార్థులు విద్య మరియు సాంస్కృతిక రంగాలలో కూడా సమైక్యతా భావం తో ముందుకు రావాలని తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన పోటీ లో 105 మంది, తెలుగు ప్రసంగాలు లో 32 మంది, ట్రేడిషనల్ షో లో 42 మంది పాల్గొనట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్. ప్రిన్సిపాల్. టి ఎస్. గౌస్ బాషా, అధ్యాపకులు, ఎన్. ఎస్. ఎస్. కోఆర్డినేటర్ అర్షద్ అలీ విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News