నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : పుంగనూరు - డిసెంబర్ 06 : పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఏబీవీపీ విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ సీనియర్ నాయకుడు విజయ శంకర్ మాట్లాడుతూ, అంబేద్కర్ దేశ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, దేశంలో సమాన హక్కుల వ్యవస్థ స్థాపనకు శాస్త్రీయ దృక్పథంతో పోరాడిన మహానుభావుడని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడేందుకు అంబేద్కర్ తీసుకున్న నిర్ణయాలు నేటికీ ప్రాధాన్యం సంతరించుకున్నాయని పేర్కొన్నారు. అలాగే, విద్య, సామాజిక సంస్కరణలు, ఆర్థిక స్వావలంబన వంటి రంగాల్లో అంబేద్కర్ మార్గదర్శకంగా నిలిచారని, యువత ఆయన ఆలోచనలను అనుసరించాలి అని సూచించారు. అనంతరం ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలిసి విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.
Admin
Namitha News