Friday, 31 July 2026 06:27:39 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

చంద్రశేఖర్ స్వామి ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం , తెప్పోత్సవం

Date : 06 November 2025 01:04 PM Views : 234

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 05 : అన్నమయ్య జిల్లా మండల కేంద్రం లోని అతి పురాతన చంద్రశేఖర స్వామి ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, దిగువపేట సర్కిల్ నుండి ఆలయం వరకు విద్యుత్ దీపాలు పచ్చని తోరణాలతో అలంకరణ చేశారు.ఆలయం ప్రధాన అర్చకులు బాలాస్వామి, రవి స్వామి ఉదయం స్వామి వారి ఆలయ శుద్ధి చేసి అభిషేకాలు అర్చనలు నిర్వహించి పలురకాల పుష్పాలతో స్వామి వార్లను అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.సాయంత్రం జ్వాలాతోరణం, అకాశదీపం,తెప్పోత్సవం సందర్బంగా ఆలయంలో భక్తులతో కిట కిట లాడాయి . వేకువ జామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం లో ఉత్సవ మూర్తులను మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అరటి పిల్లలు, విద్యుత్ దీపాలు, పలురకాల పుష్పాలతో అలంకరించిన తెప్ప పై శ్రీ పార్వతి సమేత చంద్రశేఖర స్వామి వార్లను కొలువుంచి, దివ్య పుష్కరిణిలో తె ప్పోత్సవ ఘట్టాన్ని కన్నులు పండువుగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు తండోప తండాలుగా వచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు బాలా స్వామి, రవి స్వామి, స్వామి వారిని దర్శనం కల్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే బజారు వీధిలో వెలిసిన ఆలయం చెంబకూరు, మూగవాడి గుట్టపాల్యం దగ్గర కొండ పై వెలిసిన శివాలయాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళ లు ఒక్క పొద్దుతో స్వామి వారి ఆలయ ప్రాంగణం లో మహిళలు దీపారాధన చేశారు.చంద్రశేఖర స్వామి ఆలయం లో బాలా స్వామి,రవిస్వామి గ్రామస్థులు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు .చంద్రశేఖర స్వామి ఆలయంలో దీపోత్సవం, తెప్పోత్సవం సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది బందోబస్తూ నిర్వహించారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: