నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రెల్ 29 : కన్నప్రేగుకు భారమై పురిటిబిడ్డను గుర్తు తెలియని మాతృమూర్తి పంటపొలాల్లో వదిలేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చెంబకూరు నుండి ఎలకపల్లి మార్గంలోని పొలాల్లో గుర్తు తెలియని పురిటి శిశువు శవం కలకలం రేపింది. బుధవారం వ్యవసాయ పనినిమిత్తం పొలంలోకి వెళ్లిన ఒక మహిళకు రోజులు కూడా నిండని ఒక ఆడశిశువు శవమై కనిపించడంతో భయంతో పరుగులు తీసింది. విషయం తెలుసుకొన్న మహిళ భర్త సురేంద్ర పోలీసులకు విషయం తెలియచేశాడు. అనంతరం సంఘటన స్థలానికి రామసముద్రం తహసీల్దార్ మహమ్మద్ అజరుద్ధున్, ఎస్సై హృషి కేశవరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని విచారించి పసిపాప మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం ఎస్సై మాట్లాడుతూ సంఘటనకు సంబంచిన వివరాలని శవ పంచనామా అనంతరం తెలియచేస్తామని అన్నారు.
Reporter
Namitha News