Friday, 31 July 2026 01:50:49 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

కోడి పందేలు నిర్మూలనపై పోస్టర్ ఆవిష్కరించిన జాయింట్ కలెక్టర్, ఎస్పీ

Date : 12 January 2026 05:17 PM Views : 178

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 12 : జిల్లాలో కోడి పందేలను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ఈ క్రమంలో కోడి పందేలు నిషేధం, శిక్షార్హ నేరం అనే అంశంపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి , మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆదర్శ్ రాజేంద్రన్ మాట్లాడుతూ కోడి పందేలు నిర్వహించడం చట్ట విరుద్ధమని, ప్రజలు ఈ అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. కోడి పందేలు వల్ల ఆర్థిక నష్టం, సామాజిక సమస్యలు తలెత్తడమే కాకుండా శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ, కోడి పందేలు వంటి అక్రమాలకు సహకరించకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కానుబిల్లి మాట్లాడుతూ..కోడి పందేలు నిర్వహించినా, ప్రోత్సహించినా, బెట్టింగ్ కార్యకలాపాలు చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి, అక్రమ కోడి పందేలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కే. గుణశేఖర్ పిల్లె సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :