నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 23 : తంబళ్లపల్లె మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్గా గోపీనాథ్ బాధ్యతలు చేపట్టాడు. ఆయన చిత్తూరు జిల్లా నారాయణవనం జడ్పీ హైస్కూల్ జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ పదోన్నతిపై తంబళ్లపల్లె మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్ డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి పై బైరెడ్డిపల్లి మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లారు. గోపీనాథ్ ను ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో లు ప్రసాద్, మారుతీ కుమార్, టైపిస్ట్ సురేంద్ర, జూనియర్ అసిస్టెంట్ విజయ్, ఆఫీస్ సబార్డినేట్లు ఖయ్యూం, నాగరాజు లు అభినందించి స్వాగతించారు
Reporter
Namitha News