Wednesday, 17 December 2025 09:27:00 AM
# సెల్ టవర్ కోసం కొండెక్కిన ముద్దలదొడ్డి వాసులు. # తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తాం # లే అవుట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రజలకు ఓ సువర్ణావకాశం - పి.కె.ఎం.యు.డి.ఎ. చైర్మన్ సురేష్ బాబు # మిట్స్ కు జాతీయ స్థాయి లో ఏ.ఏ.ఏ. రేటింగ్ # సైబర్ క్రైమ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు # పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయండి - డాక్టర్ జాహ్నవి # 18న వైద్య కళాశాల ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన సిపిఐ # గోపిదిన్నె వద్ద ట్రాక్టర్ డీ కొని బాలుడు దుర్మరణం # విశ్వం పాఠశాల లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ బాల,బాలికల నెట్ బాల్ సెలక్షన్స్ # మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు

ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా మాకే ప్రజాదరణ - ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి

Date : 11 December 2025 08:17 PM Views : 193

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 11 : ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ప్రజాదరణ మా పార్టీకే ఉందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హర్షద్వానాల మధ్య ప్రకటించారు. గురువారం ఆయన స్వగృహంలో తంబళ్లపల్లె ఎంపీపీగా ఎన్నికైన చిటికి శ్యామలా కోటిరెడ్డి, ఎంపీటీసీలను సన్మానించి అభినందించారు. ఆరు మండలాల నాయకులు, కార్యకర్తల మధ్య విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో జరగవలసిన ఎంపీపీ ఉప ఎన్నికలను కావాలని కుట్రతో వాయిదా వేస్తూ వస్తున్నారని అయినా తంబళ్లపల్లె ఎంపీపీగా శ్యామలా కోటిరెడ్డి ఎన్నిక మా విజయానికి నిదర్శనమన్నారు. బి కొత్తకోట ఎంపీపీ ఎన్నిక వాయిదా పై విమర్శిస్తూ అక్కడ కూడా విజయం మాదేనని ధీమాగా చెప్పారు. తంబళ్లపల్లె చరిత్రలో నిలిచిపోయే మల్లయ్య కొండ రోడ్డు, పిఆర్ గెస్ట్ హౌస్, పెద్దేరు ప్రాజెక్టు పార్కు అభివృద్ధి, బెంగళూరుకు బస్సు సౌకర్యం, సిహెచ్సీ అదనపు భవనాలు, ఆలయాల నిర్మాణం, ప్రతి గ్రామానికి లింకు రోడ్లు, సిమెంటు రోడ్లు, జగనన్న కాలనీలు, సచివాలయాలు, ఆర్ బి కే సెంటర్లు, విలేజ్ క్లినిక్స్ నిర్మాణం, ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అందించినట్లు చెప్పారు. నేడు కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక పోగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి విద్యార్థులకు వైద్య విద్య అమ్మకానికి పెట్టి ప్రజాగ్రహానికి గురైనట్లు చెప్పారు. తంబళ్లపల్లెలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి విశేష స్పందన లభించిందని కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో పాలనలో విఫలమైనట్లు విమర్శించారు. ఈ కార్యక్రమంలో.రియల్టర్ గోపి దిన్ని మల్లికార్జున రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రేపన చౌడేశ్వర, కిషోర్ కుమార్ రెడ్డి, ఆరు మండలాల వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :