నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 17 : తంబళ్లపల్లె మండలం కోసువారి పల్లెలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో టిటిడి ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నద్ధం చేస్తున్న టిటిడి అధికారులు. ఈ బ్రహ్మోత్సవాలకు రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ను కోసువారిపల్లి టిడిపి నాయకులు బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను ఇచ్చి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు తంబళ్లపల్లె మండలం లోని సమస్యలను ఆయనకు కూలంకషంగా వివరించారు. వారి ఆహ్వానాన్ని అందుకుని తప్పక బ్రహ్మోత్సవాలకు వస్తానని తంబళ్లపల్లె మండలంలో పార్టీతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట నాయకులు సోమశేఖర్, ఆదిరెడ్డి, శివరాం, కోళ్ల ఫారం శ్రీనివాసరెడ్డి, కేశవరెడ్డి, కృష్ణమూర్తి, జయరాం రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News