Friday, 31 July 2026 07:42:08 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

గోపిదిన్నె లో వైభవంగా హిందూ సమ్మేళనం

Date : 28 December 2025 10:10 PM Views : 167

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 28 : తంబళ్లపల్లె మండలం గోపి దిన్నె కొత్తపల్లి బస్ స్టాప్ లోని అభయ ఆంజనేయ ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల వారోత్సవ హిందూ సమ్మేళన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రతినిధి గంగారపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హిందూ మతంలో సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి హిందువు బాధ్యతగా భావించాలన్నారు. నేడు హిందూ సమాజం ఇతర మతాలకు తరలి వెళ్లకుండా మన సంస్కృతి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. నేటి తరం యువతకు సైతం మన సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు తో పాటు దైవచింతన, ఆధ్యాత్మికత, దేవుని ఆరాధించడం అలవాటుగా మార్చాలని హితవు పలికారు. హిందూ బంధువులు అలనాటి పురాతన కళలు కోలాటాలు, చెక్కభజనలు ప్రదర్శించే కళాకారులను ప్రోత్సహించి గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా భక్తులు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో భజన గురువు ప్రభాకర్ రెడ్డి, మహిళా కళాకారిణి లక్ష్మీనరసమ్మ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందూ బంధువులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :