Thursday, 16 April 2026 06:15:24 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మాలేనత్తం లో స్వామిత్వ గ్రామసభ

Date : 21 November 2025 07:32 PM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 21 : రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామ పంచాయతీ సచివాలయంలో శుక్రవారం సర్పంచ్ కొండూరు శ్రీనాథ్ రెడ్డి అధ్యక్షతన మండల డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ ఏ గఫూర్ ఆధ్వర్యంలో స్వామిత్వ గ్రామసభ నిర్వహించడం జరిగింది.సర్పంచ్ కొండూరు శ్రీనాథ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ ఉంటానన్నారు, పంచాయతీ ఎదరయ్యే సమస్యలకు తక్షణమే స్పందిస్తానని, ప్రజావసరాల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాననీ హామీ ఇచ్చారు. గ్రామస్థులు కూడ తమ సమస్యలు అభిప్రాయాలను అధికారులు, ప్రజా ప్రతినిధులసమక్షంలో వెళ్ళడించారు. మాలేనత్తం టిడిపి యువ నాయకులు రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్,ఐటీ మంత్రి లోకేష్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని రాబోయే రోజుల్లో తన సొంత నిధులతో గ్రామ పంచాయతీ ని అభివృద్ధి చేస్తానని ఇటువంటి స్వామిత్వ పంచాయతీ రాజ్ గ్రామ ఈ గ్రామసభలో గ్రామ సభలు భవిష్యత్తులో గ్రామాభివృద్ధికి మార్గదర్శకాలు అవుతాయని గ్రామపంచాయతీ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తాన న్నారు. డిప్యూటీ ఎంపిడిఓ గఫుర్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని ఇంటి యజమానులకు వారి ఇంటి ఖాళీ స్థలము మరియు ఇంటి నిర్మాణంతో కొలతలు 9(2) తీసి నోటీసులు పంపిణీ చేసి వాటిలో గల కొలతలు సరిచూసుకొని ఏవైనా అభ్యంతరములు ఉంటే గ్రామసభలో రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. గ్రామ ప్రజలకు అభ్యంతరములను స్వీకరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గపూర్ పంచాయతీ సెక్రటరీ ఇర్ఫాన్,శ్రీనాథ్ రెడ్డి, రూపేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,శివారెడ్డి, మహేష్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :