నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 21 : రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామ పంచాయతీ సచివాలయంలో శుక్రవారం సర్పంచ్ కొండూరు శ్రీనాథ్ రెడ్డి అధ్యక్షతన మండల డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ ఏ గఫూర్ ఆధ్వర్యంలో స్వామిత్వ గ్రామసభ నిర్వహించడం జరిగింది.సర్పంచ్ కొండూరు శ్రీనాథ్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి కోసం నేను ఎల్లప్పుడూ ఉంటానన్నారు, పంచాయతీ ఎదరయ్యే సమస్యలకు తక్షణమే స్పందిస్తానని, ప్రజావసరాల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాననీ హామీ ఇచ్చారు. గ్రామస్థులు కూడ తమ సమస్యలు అభిప్రాయాలను అధికారులు, ప్రజా ప్రతినిధులసమక్షంలో వెళ్ళడించారు. మాలేనత్తం టిడిపి యువ నాయకులు రూపేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సి ఎం పవన్ కళ్యాణ్,ఐటీ మంత్రి లోకేష్,ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవతో గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తానని రాబోయే రోజుల్లో తన సొంత నిధులతో గ్రామ పంచాయతీ ని అభివృద్ధి చేస్తానని ఇటువంటి స్వామిత్వ పంచాయతీ రాజ్ గ్రామ ఈ గ్రామసభలో గ్రామ సభలు భవిష్యత్తులో గ్రామాభివృద్ధికి మార్గదర్శకాలు అవుతాయని గ్రామపంచాయతీ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తాన న్నారు. డిప్యూటీ ఎంపిడిఓ గఫుర్ మాట్లాడుతూ పంచాయతీ పరిధిలోని ఇంటి యజమానులకు వారి ఇంటి ఖాళీ స్థలము మరియు ఇంటి నిర్మాణంతో కొలతలు 9(2) తీసి నోటీసులు పంపిణీ చేసి వాటిలో గల కొలతలు సరిచూసుకొని ఏవైనా అభ్యంతరములు ఉంటే గ్రామసభలో రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు. గ్రామ ప్రజలకు అభ్యంతరములను స్వీకరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో గపూర్ పంచాయతీ సెక్రటరీ ఇర్ఫాన్,శ్రీనాథ్ రెడ్డి, రూపేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,శివారెడ్డి, మహేష్ రెడ్డి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News