Thursday, 30 July 2026 06:08:45 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

నెట్ వర్క్ లేక పెన్షన్ల కోసం పండుటాకుల ఆగచాట్లు

సెల్ టవర్ లేక, సిగ్నల్ రాక, పింఛన్లు అందక ఆగచాట్లు

Date : 31 January 2026 11:07 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 31 : తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి (బాలిరెడ్డిగారిపల్లి) పంచాయతీ లోని 22 గ్రామాలకు సెల్ టవర్ లేక ప్రభుత్వ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. శనివారం పెన్షన్లు పంపిణీ కోసం అధికారులు వృద్ధులను విధి లేని పరిస్థితుల్లో గుట్టలు ఎక్కించి నెట్వర్క్ ఉన్న చోటికి రమ్మని చెప్పడంతో విధి లేని పరిస్థితుల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ కోసం ముప్పు తిప్పలు పడి గ్రామానికి సుదూర ప్రాంతంలోని గుట్టలు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. సెల్ టవర్ నిర్మాణం చేపట్టాలని గత ఆరు మాసాలుగా స్థానిక టిడిపి రాజంపేట పార్లమెంటు రైతు నాయకుడు వెంకట్ రెడ్డి బృందం ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లా కలెక్టర్, నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి లకు ఫిర్యాదులు చేశారు. సెల్ టవర్ లేకపోవడంతో పెన్షన్ దగ్గర నుండి ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకం సకాలంలో అందక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి సెల్ టవర్ నిర్మాణానికి సహకరించాలని టిడిపి రాజంపేట రైతు నాయకుడు వెంకట్రెడ్డి, స్టోర్ డీలర్ సుధాకర్, ప్రజలు కోరుతున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :