నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 27 ః మండలంలోని ఎద్దుల వారి పల్లి పంచాయతీ జన్నే వారి పల్లికు చెందిన చిన్న గౌని వెంకటరమణ కు చెందిన రేకుల షెడ్డు సోమవారం మధ్యాహ్నం ఈదురుగాలులకు కూలిపోయి నట్లు స్థానిక టిడిపి నాయకుడు నరసింహులు నాయుడు తెలిపారు.మధ్యాహ్నం పెద్ద ఎత్తున ఈదురుగాలులు వేగంగా వెంకటరమణ రేకుల షెడ్డును తాకాయి. అదే సమయంలో వెంకటరమణ షెడ్డు కిందనే ఉండగా సిమెంట్ రేకులు పడే సమయంలో పక్కకు తప్పుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. రేకుల షెడ్డు కూలిపోవడంతో సుమారు రెండు లక్షల పైగా ఆస్తి నష్టం సంభవించిందని వెంకటరమణ విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం స్పందించి రేకుల షెడ్డు కు నష్టపరిహారం చెల్లించాలని ఆ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
Reporter
Namitha News