Wednesday, 17 June 2026 02:10:35 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

మూడు గ్రామాలలో పిచ్చికుక్క వీరంగం @ 22 పశువులకు తీవ్ర గాయాలు

ముమ్మరంగా పశువైద్య సేవలు

Date : 10 June 2026 10:48 PM Views : 49

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 10 : పిచ్చి కుక్క వీరంగం సృష్టించి మూడు గ్రామాల ప్రజలు ముప్పు తిప్పలు పెట్టి గ్రామాలలోని 22 పశువులను గాయపరిచి సంచలనం సృష్టించి బెంబేలెత్తించిన సంఘటన కోసువారి పల్లి పంచాయతీలో వెలుగు చూసింది. పంచాయతీలోని దేవరబురుజు, సి కె దయ్యాలవారిపల్లి, మేకల వారి పల్లె గ్రామాలలో బుధవారం తెల్లవారుజామున ఓ పిచ్చి కుక్క వీరంగం సృష్టించి కనపడిన పశువులను విచక్షణ రహితంగా కరచి తీవ్రంగా గాయపరిచింది. తొలుత దేవరబురుజులో రెడ్డప్ప రెడ్డి కి చెందిన రెండు పశువులతో పాటు గ్రామంలో ఆరుబయట గల పలు పాడి ఆవులు, దూడలను గాయపరగా స్థానికులు తరిమికొట్టగా అదే ఊపులో పక్కనే గల సీ.కే దయ్యాలవారిపల్లి లో సైతం పలువురు రైతులకు చెందిన పాడియావులు దూడలను గాయపరిచి చివరిగా మేకల వారి పల్లెలో మరోసారి విజృంభించి పాడి పశువులను గాయపరిచింది. మొత్తంగా మూడు గ్రామాలలో 16 పాడి ఆవులు, ఆరు పాడి దూడలను గాయపరిచింది.విషయం తెలుసుకున్న గ్రామస్తులు మూకుమ్మడిగా పిచ్చి కుక్కను వెంటాడి చంపేశారు. పిచ్చికుక్క కాటుకు గురైన పశువుల రైతులు ఆందోళనతో లబోదిబోమంటూ పశువుల డాక్టర్ కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. మండల పశువైద్యాధికారి విక్రం రెడ్డి యుద్ధ ప్రాతిపదికన పశు వైద్య సిబ్బందిని పై మూడు గ్రామాలకు పంపించి కుక్క కాటు పశువులకు ర్యాపిడ్ టీకాలను వేయడానికి పురమయించారు. పశు వైద్యాధికారి ఇందు, సిబ్బంది రమేష్, నాయక్ లు కుక్క కాటు బారిన పడిన పశువులకు ర్యాపిడ్ టీకాలు వేసి నెలరోజుల పాటు వర్షానికి తడవరాదని వైద్య సిబ్బంది సూచనలు, సలహాలు పాటించాలని రైతులకు సూచనలు ఇచ్చారు. కుక్క కాటు రైతులు లక్షలాది రూపాయల వ్యయంతో కొని వాటి పాల దిగుబడితో జీవనోపాధి సాగిస్తున్నామని పశువులకు ప్రాణాపాయం జరిగితే వాటినే నమ్ముకున్న మేము ఎలా బతకాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. పిచ్చికుక్క పశువులపై పడటం జరిగిందని అదే చిన్నారులు, మనుషులపై విజృంభిస్తే పరిస్థితి ఏంటని తలచుకొని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కల స్వైర విహారం పై దృష్టి సారించి కుక్క కాటు పశువుల రైతులను ఆదుకోవడానికి అండగా నిలవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: