నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబలకోట - జూన్ 02 : తంబళ్లపల్లి ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులు 2026 సర్ ఎలెక్టోరల్ మ్యాపింగ్ పక్కాగా రూపొందించాలని తహసిల్దార్ ధనంజయలు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కురబల కోట తహసిల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ అధికారులు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ SIR ను పక్కాగా జాబితా లో ఎలాంటి పొరపాట్లు, అవకతవకలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా రూపొందించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి నివేదించాలన్నారు. సమావేశంలో శేషాద్రి రావు, సూపర్వైజర్లు ,బూతు లెవెల్ అధికారులు పాల్గొన్నారు.
Reporter
Namitha News