Wednesday, 17 December 2025 09:26:59 AM
# సెల్ టవర్ కోసం కొండెక్కిన ముద్దలదొడ్డి వాసులు. # తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తాం # లే అవుట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రజలకు ఓ సువర్ణావకాశం - పి.కె.ఎం.యు.డి.ఎ. చైర్మన్ సురేష్ బాబు # మిట్స్ కు జాతీయ స్థాయి లో ఏ.ఏ.ఏ. రేటింగ్ # సైబర్ క్రైమ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు # పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయండి - డాక్టర్ జాహ్నవి # 18న వైద్య కళాశాల ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన సిపిఐ # గోపిదిన్నె వద్ద ట్రాక్టర్ డీ కొని బాలుడు దుర్మరణం # విశ్వం పాఠశాల లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ బాల,బాలికల నెట్ బాల్ సెలక్షన్స్ # మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు

ఉపాధి హామీ పనులు, కూలీలను పెంచాలి - డ్వామా పీ.డి. వెంకటరత్నం

Date : 09 December 2025 08:22 PM Views : 60

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 09 : తంబళ్లపల్లి మండలంలో ఉపాధి హామీ పనులు పెంచి కూలీలకు ఉపాధి చూపించకపోతే కఠిన చర్యలు తప్పవని డ్వామా పీడి వెంకటరత్నం క్షేత్ర సహాయకులను హెచ్చరించారు. మంగళవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీలకు సిబ్బందితో సమీక్ష జరిపారు. ఉపాధిలో ఫారం పాండ్స్, కంపోస్ట్ ఫిట్స్, పశువుల షెడ్లు, సోంపిట్సి నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలన్నారు. గతంలో ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారంలోపు పనులు ఊపందుకోవాలన్నారు. ఫారం పాండ్స్ , కంపోస్ట్ ఫిట్స్ రైతుల పొలాలతోపాటు ప్రభుత్వ స్థలాలలో పనులు చేపట్టాలన్నారు. జాబ్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించాలని సూచించారు.తొలుత ఆయన కన్నెమడుగు సచివాలయం ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులతో పాటు సిబ్బంది పనితీరు పై సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమీక్షలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో లు ప్రసాద్, మారుతీ కుమార్, ఏపీఓ అంజనప్ప, ఈసీ మహేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, పుష్ప కుమారి, బాలగంగాధర్, భూదేవి, మండలంలోని క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :