Monday, 03 August 2026 06:45:16 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి -- మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా

Date : 21 April 2026 06:19 PM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలి -- మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద ఎపి మున్సిపల్ వర్కర్స్ అంస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ధర్నా నిర్వహించారు. మున్సిపల్ వర్కర్స్ కి వెంటనే జీతాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు హరిశర్మ, పట్టణ కన్వీనర్ రామకృష్ణ లు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు చాలీచాలని జీతాలతో ఉదయం 5 గంటలకే విధుల్లోకి వచ్చి వీధులను, కాలువలను, రోడ్లను శుభ్రం చేస్తూ, చెత్త చెదారాన్ని ఎత్తేస్తూ పారిశుద్ధ్య మెరుగుకు ఎంతో పని చేస్తున్నామన్నారు‌ తమకు చాలీచాలని జీతాలతోనే జీవితాలను నెట్టికొస్తున్నామని, కుటుంబాలు గడవడం కష్టతరంగా మారిందన్నారు. ఇస్తున్న తక్కువ జీతం కూడా నెలలు తరబడి బకాయిలు పెట్టడంతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టతరంగా మారిందన్నారు. మార్చి నెల జీతం ఏప్రిల్ 21వ తేదీ అవుతున్నా ఇవ్వకపోవడంతో తాము ఎలా బ్రతకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్ అయిన, మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. 20 నుంచి 25 ఏళ్ల పాటు పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న వారికి వెంటనే ఇళ్ల స్థలాలను మంజూరు చేసి నిర్మాణాలకు ప్రభుత్వం రుణాలు మంజూరు చేయాలని కోరారు. తమకు కడుపు మండినందునే ప్రభుత్వం పై తిరుగుబాటు చేస్తూ ఒకరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. తమను ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ సకాలంలో జీతాలు చెల్లించకపోతే ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కావున మున్సిపల్ అధికారులు స్పందించి తమ జీతాలను వెంటనే విడుదల చేసేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడమని హెచ్చరించారు. అనంతరం కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శ్రీనివాసులు సిఐటియు నాయకులు ప్రభాకర్ రెడ్డి, గోపాల్, రామచంద్ర, కృష్ణప్ప, రాజు, మంజుల, శివమ్మ, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :