నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 28 ః గ్రామాలలో సేకరించిన తడి, పొడి చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించి ఎరువు తయారు చేయాలని ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ గ్రీన్ అంబాసిడర్ కు సూచించారు. మంగళవారం ఆయన డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్ తో కలిసి కోటకొండ, కుక్క రాజు పల్లి పంచాయితీల్లోని గ్రామాలలో పారిశుద్ధ్యంపై ఆరాతీశారు. అనంతరం డంపింగ్ యార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి సేకరించిన తడి, పొడి చెత్తను సేంద్రియ ఎరువుల తయారీకి సిద్ధం కావాలన్నారు. ప్రతిరోజు పారిశుద్ధంపై దృష్టి సారించి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి చేయూతనివ్వాలని సూచించారు. వారి వెంట పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు
Reporter
Namitha News