నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 20 : ప్రధాని సూర్యఘర్ సోలార్ విద్యుత్ వినియోగం తద్వారా వారికి లభించే లబ్ధిపై ప్రజల్లో అవగాహన పెంచాలని విద్యుత్ శాఖ డి ఈ గంగాధరం సూచించారు. శనివారం ఆయన మండలంలోని కుక్కరాజుపల్లి, కోటకొండ, రేణుమాకులపల్లె లో ఎస్సీలకు ఉచితంగా ఏర్పాటుచేసిన రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తంచేశారు. భవిష్యత్తులో సోలార్ విద్యుత్తు ద్వారా బిల్లులు చెల్లించే పని లేకుండా లబ్ధిదారునికేఆదాయ లబ్ధి చేకూరే విషయాన్ని విస్తృత పరచాలన్నారు. అనంతరం పలు విద్యుత్ సబ్ స్టేషన్ లను తనిఖీ చేసి విద్యుత్ సరఫరా వేళలు, సిబ్బంది పనితీరు పై ఆరా తీశారు. వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాలు లేకుండా ట్రీ కటింగ్ చేపట్టి రైతులకు 9 గంటలకు విద్యుత్తు అందించాలన్నారు. పొలాల వద్ద వన్యప్రాణుల కోసం విద్యుత్ సరఫరా చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. విద్యుత్ సిబ్బంది బిల్లుల వసూళ్లపై దృష్టి సారించి వినియోగదారుల విద్యుత్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరించాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏడి గోవిందరెడ్డి, ఏఈ సురేంద్ర, లైన్ ఇన్స్పెక్టర్ లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్ శంకర్, ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News